ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెలకంటి కన్నుమూత..
- January 05, 2021టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెలకంటి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్తో కాసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. 1988లో మురళీ కృష్ణుడు మూవీ ద్వారా వెన్నెలకంటి లిరిసిస్ట్గా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఆదిత్య 369, ఘరానా అల్లుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, సమరసింహారెడ్డి, టక్కరి దొంగ, వస్తాడు నా రాజు, చెప్పాలని ఉంది ఇలా పలు హిట్ సినిమాలకు ఆయన సాహిత్యం అందించారు. ఇక తెలుగులో డబ్బింగ్ అయిన పలు తమిళ చిత్రాలకు ఆయన డైలాగ్ రైటర్గా పనిచేశారు. చివరగా గతేడాది పెంగ్విన్ చిత్రానికి ఆయన లిరిక్ రైటర్గా పనిచేశారు. కాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దకుమార్ శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు రైటర్గా పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు రాకేందు మౌళి నటుడిగా, రిలిక్స్ రైటర్గా, సింగర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు