పేరుపాలెం సౌత్ లో అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ
- February 22, 2016
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల పరిధిలోని పేరుపాలెం సౌత్లో రూ.5కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం భూమిపూజ చేశారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా చిరంజీవి మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సర్పంచి సోమిశెట్టి రంగనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో చిరంజీవి మాట్లాడుతూ.. పేరుపాలెం సౌత్ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉండడంతో దత్తత తీసుకున్నానని చెప్పారు. భవిష్యత్లో మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని తెలిపారు. గ్రామంలో నూతన జూనియర్ కళాశాల, పీహెచ్సీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







