న్యూ ఢిల్లీ:రైతు సంఘాలతో కేంద్రం 8వ విడత చర్చలు
- January 08, 2021
న్యూ ఢిల్లీ:రైతు సంఘాలతో కేంద్రం 8వ విడత చర్చలు ప్రారంభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్లు చర్చల్లో పాల్గొన్నారు. ఇందులో 41 రైతు సంఘాల నేతలు పాల్గొంటున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుంటే.. కేంద్రం మాత్రం సాగు చట్టాల రద్దు మినహా ఏదైనా పరిశీలిస్తామని చెబుతోంది. అటు.. చర్చలకు ముందు అమిత్ షాతో వ్యవసాయ మంత్రి తోమర్ భేటీ అయ్యారు. ఇదివరకే ఏడు సార్లు కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపింది. అయితే రైతు సంఘాలు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టడంతో అవేవీ ఫలించలేదు. ప్రభుత్వం మాత్రం సవరణలకు సిద్ధమంటోంది. కానీ చట్టాల రద్దుకు అంగీకరించడం లేదు. ఇదే అంశంపై రైతు సంఘాలు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాయి. ఈ నెల 11న ఆ కేసు విచారణకు రానుంది. ఇక ఇవాళ ఎనిమిదోసారి చర్చలు జరుపుతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







