యూఏఈలో వణికిస్తున్న మైనస్ టెంపరేచర్స్..-2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- January 10, 2021
యూఏఈలోని చాలా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. అబుధాబి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రక్నా ప్రాంతంలో అయితే..ఏకంగా మైనస్ 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున లేచి చూసే సరికి చుట్టుపక్కల ప్రాంతాలన్ని మంచుతో నిండిపోయాయి. ఐసిక్లెస్ ప్రాంతంలో గడ్డి మొక్కలపై ఐస్ పేరుకుపోయిన దృశ్యాలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రక్నా ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కనిష్టం కంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్లు జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. తూర్పు నుంచి ఈశాన్యం దిశగా కదులుతున్న చల్లని గాలుల ప్రభావంతో అబుధాబి ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని, సోమవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వివరించారు. మంగళవారం నుంచి గాలి దిశలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో రెండ్రోజుల్లో వాతావరణంలో మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







