యూఏఈలో వణికిస్తున్న మైనస్ టెంపరేచర్స్..-2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- January 10, 2021
యూఏఈలోని చాలా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. అబుధాబి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రక్నా ప్రాంతంలో అయితే..ఏకంగా మైనస్ 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున లేచి చూసే సరికి చుట్టుపక్కల ప్రాంతాలన్ని మంచుతో నిండిపోయాయి. ఐసిక్లెస్ ప్రాంతంలో గడ్డి మొక్కలపై ఐస్ పేరుకుపోయిన దృశ్యాలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రక్నా ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కనిష్టం కంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్లు జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. తూర్పు నుంచి ఈశాన్యం దిశగా కదులుతున్న చల్లని గాలుల ప్రభావంతో అబుధాబి ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని, సోమవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వివరించారు. మంగళవారం నుంచి గాలి దిశలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో రెండ్రోజుల్లో వాతావరణంలో మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







