యూఏఈలో వణికిస్తున్న మైనస్ టెంపరేచర్స్..-2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- January 10, 2021యూఏఈలోని చాలా ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. అబుధాబి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రక్నా ప్రాంతంలో అయితే..ఏకంగా మైనస్ 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున లేచి చూసే సరికి చుట్టుపక్కల ప్రాంతాలన్ని మంచుతో నిండిపోయాయి. ఐసిక్లెస్ ప్రాంతంలో గడ్డి మొక్కలపై ఐస్ పేరుకుపోయిన దృశ్యాలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రక్నా ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కనిష్టం కంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్లు జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. తూర్పు నుంచి ఈశాన్యం దిశగా కదులుతున్న చల్లని గాలుల ప్రభావంతో అబుధాబి ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని, సోమవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వివరించారు. మంగళవారం నుంచి గాలి దిశలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో రెండ్రోజుల్లో వాతావరణంలో మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్