ఏపీలో కరోనా కేసుల వివరాలు

- January 10, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 227 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,84,916  కి చేరింది.  ఇందులో 8,75,243   మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,544 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మరణించారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,129 కి చేరింది.  ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 289 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్, ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com