భారత్ లో మళ్లీ భారీగా పెరిగిన కేసులు
- January 13, 2021
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 15,968 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 202 మంది మృతిచెందగా.. 17,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దీంతో... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,95,147కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,01,29,111 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మరోవైపు ఇప్పటి వరకు 1,51,529 మంది కరోనాతో మృతిచెందారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,14,507 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక, మంగళవారం రోజు దేశవ్యాప్తంగా 8,36,227 కరోనా శాంపిల్స్ పరీక్షించామని.. దీంతో.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ల సంఖ్య 18,34,89,114కు చేరుకుందని ఐసీఎంఆర్ ప్రకటించింది. కాగా, గత బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా 12,584 కొత్త కేసులు మాత్రమే నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగి 15,968కు చేరుకుంది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







