వ్యాక్సిన్ ద్వారానే సాధారణ జనజీవనం సాధ్యం..ప్రజలకు యూఏఈ పిలుపు
- January 14, 2021
యూఏఈ:కోవిడ్ 19తో ఎదుర్కొంటున్న గడ్డు కాలాన్ని అధిగమించి...మళ్లీ సాధారణ జీవితాన్ని గడపాలంటే వ్యాక్సిన్ తీసుకోవటం ఒక్కటే పరిష్కార మార్గమని యూఏఈ ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. దేశ భవిష్యత్తు, సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కోవిడ్ 19 క్లీనికల్ మేనేజ్మెంట్ కమిటీ పిలుపునిచ్చింది. సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతు భాధ్యత నేరవేర్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన తర్వాత..దాని ప్రభావంపై ఇంకా కొంత మందిలో అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవాలని ఖచ్చితమైన షరుతులు విధించకుండా స్వచ్ఛందంగా వచ్చిన వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే..వ్యాక్సిన్ ను సమాజంలో కొద్ది మంది తీసుకోవటం ద్వారా ప్రయోజనం ఉండదని, ఎక్కువ సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ అందినప్పుడే దాని లక్ష్యం నేరవేరుతుందని కమిటీ వివరించింది. దీని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఆ వ్యక్తి తనకు తాను వైరస్ నుంచి రక్షించుకోవటమే కాకుండా...వైరస్ వ్యాప్తిని అడ్డుకొని తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడిన వారు అవుతారని తెలిపింది. అంతేకాదు..వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ప్రయాణ ఇబ్బందులు కూడా తొలిగిపోతాయని, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించిన వారు క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని గుర్తు చేసింది. ఇక దేశ ఆర్ధిక పురోగమనానికి, అందమైన భవిష్యత్తుకు వ్యాక్సిన్ ఒక బూస్టర్ షాట్ గా పని చేస్తుందని అభివర్ణించింది కమిటీ.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







