నార్వేలో ఫైజర్ వ్యాక్సిన్ వికటించి 23 మంది వృధ్ధుల మృతి
- January 16, 2021
ఓస్లో:నార్వేలో ఫైజర్, బయో ఎన్ వ్యాక్సిన్ తీసుకున్న వృధ్ధుల్లో 23 మంది మరణించగా, మరో 23 మంది తీవ్ర అస్వస్థత పాలయ్యారు. 80 ఏళ్లకు పైబడిన వృధ్ధుల్లో ఈ మరణాలు ఎక్కువగా సంభవించాయని డాక్టర్లు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. వయస్సు మరీ మీద పడినవారు, ఈ టీకామందు తీసుకోకపోవడమే మంచిదని నార్వేజియన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకటించింది. డాక్టర్లు కూడా ఈ విషయమై ప్రజలను హెచ్చరించాలని సూచించింది. దేశంలో ఇప్పటివరకు ఫైజర్ లేదా మోడెర్నా వ్యాక్సిన్ ని 30 వేలమందికి పైగా తీసుకున్నారు. నార్వే కోవిడ్ మరణాల నేపథ్యంలో యూరప్ కు తమ టీకామందు సరఫరాను తగ్గిస్తామని ఫైజర్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తున్న సంస్థ ప్రకటించింది. అటు ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 21 మంది మహిళలు, 8 మంది పురుషులు సైడ్ ఎఫెక్ట్స్ కి గురయ్యారు.
తమ వ్యాక్సిన్ విషయంలో ఆయా పబ్లిక్ హెల్త్ సంస్థలు ఆయా ప్రొటొకాల్స్ పాటించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థ కోరుతోంది. ముఖ్యంగా 80 ఏళ్ళు పైబడిన వృధ్ధుల్లో ఇతర శారీరక జబ్బులు, రుగ్మతలు కూడా ఉండవచ్ఛునని, బహుశా అవి కూడా వారి మరణానికి దారి తీసి ఉండవచ్ఛునని ఈ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..