లండన్ తరహా ట్యాక్సీలు దుబాయ్లో అతి త్వరలో
- January 16, 2021
దుబాయ్:దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి) త్వరలో లండన్ ట్యాక్సీ సర్వీస్ను ప్రారంభించనుంది. ఫ్యూయల్ అలాగే ఎలక్ట్రిసిటీని ఈ ట్యాక్సీలు వినియోగించనున్నాయి. బ్రిటిష్ రాజధానిలో ట్యాక్సీలు నల్లటి రంగుతో, సెమీ కర్వ్డ్ షేప్లో వుంటాయి. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్ని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభిస్తారు. ప్రత్యేక క్యాబిన్లో మొత్తం ఆరు సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి ఈ కారులో. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం కూడా తగిన సదుపాయాలు వుంటాయి. శాటిలైట్ బేస్డ్ నావిగేషన్, వాయిస్ కమాండ్, ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ డిపాచ్యుర్ వార్నింగ్ సిస్టమ్స్, వైఫై వంటి సౌకర్యాలు ఇందులో పొందుపరిచారు. డ్యూయల్ ఇంజిన్ మరో ప్రత్యేకత. 30 నిమిషాల్లో రీచార్జ్ అయ్యే బ్యాటరీని వీటిల్లో వినియోగిస్తారు.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









