పీసీఆర్ టెస్ట్ సెంటర్లను తగ్గించిన దుబాయ్ హెల్త్ అథారిటీ
- January 20, 2021
దుబాయ్:కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం, గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి కొద్దిగా ఆశాజనకంగా మారటంతో దుబాయ్ హెల్త్ అథారిటీ పీసీఆర్ టెస్ట్ సెంటర్ల కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. మాల్స్ తో పాటు కొన్ని కీలక కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పీసీఆర్ టెస్ట్ సెంటర్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే..ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలను కొనసాగిస్తామని, టెస్ట్ చేయించుకోవాలని అనుకునేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాలని తెలిపింది. అలాగే ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా పరీక్షలు చేయించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ కొన్ని టెస్ట్ కేంద్రాలను కంటిన్యూ చేస్తున్నామని వెల్లడించింది. అల్ రషీదియా మజ్లిస్, జుమ్మెరా 1 పోర్ట్, అల్ నాస్ర్ క్లబ్ లోని పీసీఆర్ పరీక్షా కేంద్రాలలో అపాయింట్మెంట్ ప్రతిపాదికన టెస్టులు చేయనున్నారు. అలాగే డైరా సిటీ సెంటర్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మాత్రం నేరుగా వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకోవచ్చు.
తాజా వార్తలు
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్కు ట్రంప్ ఆతిథ్యం..!!







