కువైట్: వృద్ధులకు నో రెసిడెన్సీ రెన్యూవల్స్..70 ఏళ్లు దాటితే దేశం విడిచి వెళ్లాల్సిందే
- January 20, 2021
కువైట్ సిటీ:దేశంలో ఉంటున్న ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్ పై కొన్ని సవరణలు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. 60 ఏళ్లు అంతకు మించి వయసున్న వృద్ధులకు నివాస అనుమతులను రెన్యూవల్ చేసేది లేదని స్పష్టం చేసింది. అయితే..వారి విద్యార్హతలు, దేశావసరాలకు అనుగుణంగా సరిపోయే వృత్తి నైపుణ్యత ఉన్న వారికి మాత్రం వయసుకు అనుగుణంగా కొన్ని మినహాయింపులు ప్రకటించింది. 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కులు కువైట్లో రెసిడెన్సీ రెన్యూవల్ చేయించుకోవాలనుకుంటే హై స్కూల్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యూయేట్ సర్టిఫికెట్ తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 65 ఏళ్లకు మించిన వృద్ధులు ప్రత్యేక నైపుణ్య రంగాల్లో గ్రాడ్యుయేట్లు అయి ఉండి...దేశ అవసరాలకు సరిపోయేలా కీలక రంగాల్లో ఉంటేనే నివాస అనుమతులను రెన్యూవల్ చేయనున్నారు. అంటే వైద్య రంగంలో స్పెషలైజేషన్ లేదా కన్సల్టెంట్స్, ఇతర నైపుణ్య రంగాల్లో ఉన్న వారికి రెసిడెన్సీ రెన్యూవల్ చేయనున్నారు. ఇక 70 ఏళ్లు అంతకుమించి వయసుపైబడిన వారికి హైస్కూల్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యూయేషన్, ఇతర నైపుణ్య రంగాల్లో ఉన్నా రెసిడెన్సీ రెన్యూవల్ చేయబోమని కువైట్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!







