సేఫ్టీ క్యాంపెయిన్లో 10000 మంది రెసిడెంట్స్
- February 24, 2016
ఏస్టెర్ డీఎం హెల్త్ కేర్, 10000 మంది బహ్రెయినీ రెసిడెంట్స్తో రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ చేపడుతోంది. ఫిబ్రవరి 7న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, సేఫ్టీ క్యాంపెయిన్కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ముందుకొచ్చినవారి సంఖ్య 10000కు చేరుకుందని నిర్వాహకులు తెలిపారు. ఏస్టర్ ఛైర్మన్ మరియు మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అజాద్ మోపెన్ మరియు ఇండియన్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడకపోవడం, ప్రయాణ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ ఉపయోగించడం, జీబ్రా క్రాసింగ్స్ని, సబ్ వేస్, ఫుట్ పాత్స్ని వినియోగించడం వంటివి ఇందులో ముఖ్యమైన అంశాలు. పబ్లిక్ పార్కుల వద్ద నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాల్లో పౌరులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్, ఆండాలుస్ గార్డెన్, మెరీనా బీచ్, అరద్ రిజర్వ్, సితారా కోర్నిచె, సల్మానియా పార్క్ తదితర చోట్ల ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అలాగే పలు స్కూళ్ళు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







