డ్రైవింగ్ లైసెన్స్ రుసుముపై మహిళల ఫిర్యాదు
- February 23, 2016
రస్ అల్ ఖైమాలోని పలువురు మహిళలు, డ్రైవింగ్ స్కూల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రుసుమును పెంచినట్లుగా ఫిర్యాదు చేశారు. ఈ పెంపు 50 శాతం వరకూ ఉంది. అలాగే డ్రైవింగ్లో స్కిల్స్ పెంచుకోవడానికి తగిన సమయం కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. పెంచిన ఫీజులు తగ్గించాలనీ, అలాగే నాణ్యతతో కూడిన లెర్నింగ్ ఉండేలా డ్రైవింగ్ స్కూల్స్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మహిళలు పేర్కొన్నారు. ఈజిప్ట్కి చెందిన ఉమ్ అబ్దుల్లా మాట్లాడుతూ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా ఖర్చు చేశాననీ, లెసన్స్ విషయంలో కూడా తనకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అన్క్వాలిఫైడ్ డ్రైవింగ్ టీచర్స్తో డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారామె. గతంలో 25 దిర్హామ్లు చెల్లించేవారమనీ, ఇప్పుడు అదే గంట క్లాస్ కోసం 50 దిర్హామ్లు చెల్లించవలసి వచ్చిందని సిరియా వలసదారు అయిన ఉమ్ మహమ్మద్ చెప్పారు. పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులతో సంబంధిత వర్గాలు స్పందించి, డ్రైవింగ్ స్కూల్స్లో ఇన్స్పెక్షన్ ప్రారంభించారు. అనుభవజ్ఞులైనవారితోనే డ్రైవింగ్ పాఠాలు చెప్పించాలనీ, నీట్నెస్ అలాగే, డ్రెస్ కోడ్ విషయంలోనూ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అధికారులు చెప్పారు. సంబంధిత శాఖ, ఫీజుల్ని పెంచుకోవడానికి ఆస్కాంర కల్పించినప్పటికీ, తగిన సౌకర్యాలు కల్పించని పక్షంలో చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







