కొత్త ర్యాపిడ్ పరీక్షలకు అబుధాబి అనుమతి...20 నిమిషాల్లో రిజల్ట్
- January 24, 2021అబుధాబి:కోవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాల జాప్యం ఆరోగ్య శాఖలోని అత్యవసర విభాగాల్లో చికిత్సకు విఘాతంగా మారుతున్న విషయం తెలిసిందే. ఎవరికి వైరస్ సోకిందో..లేదో తెల్సుకున్నాకే వైద్య చికిత్సలు అందిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా అత్యవసరంగా చికిత్స అందించాల్సి వచ్చినప్పుడు చిక్కులు ఎదురవుతున్నాయి. పేషెంట్ల కు కోవిట్ టెస్ట్ నిర్ధారించిన తర్వాతే చికిత్స ప్రారంభిస్తుండటం అత్యవసర విభాగాల్లోని పేషెంట్లకు అతి పెద్ద సమస్యగా మారింది. అయితే..వీటికి విరుగుడుగా కేవలం 20 నిమిషాల్లోనే కోవిడ్ టెస్ట్ రిజల్ట్ తెలిపే ర్యాపిడ్ టెస్టులకు అబుధాబి ఆమోదం తెలిపింది. ఈ ర్యాపిడ్ టెస్ట్ విధానం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లు, అర్జెంట్ కేర్ సెంటర్లలో ఎంతో దోహదపడున్నాయి. అబుధాబి ఆమోదించిన ర్యాపిడ్ టెస్ట్ విధానాల వివరాలు ఇలా ఉన్నాయి.
యాంటిజెన్ టెస్ట్ : ముక్కు నుంచి శాంపిల్స్ తీసుకొని వైరస్ ఉందో లేదో కేవలం 20 నిమిషాల్లో నిర్ధారిస్తారు.
ఆర్టీ లాంప్ జనటిక్ టెస్ట్ : ఈ విధానంలోనూ ముక్కు నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. 60 నిమిషాల్లో ఫలితం తేలిపోతుంది.
సలైవ స్పెసిమెన్స్(లాలజల నమూనా విధానం) : ఈ విధానాన్ని చిన్న పిల్లల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లల ముక్కు నుంచి శాంపిల్స్ తీయటం ఇబ్బంది మారినప్పుడు వారి లాలా జలాన్ని సేకరించి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం