ట్రూజెట్ వారి రిపబ్లిక్ డే ఆఫర్

- January 24, 2021 , by Maagulf
ట్రూజెట్ వారి రిపబ్లిక్ డే ఆఫర్

భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన ప్రయాణికులకు దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డోమేస్టిక్ ప్రయాణ టికెట్‌ను రూ. 926కే ఆఫర్ చేస్తోంది. ఈ టికెట్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభం అవగా.. జనవరి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ట్రూజెట్ సంస్థ తెలిపింది. అయితే, రూ. 926 రేట్‌కు ట్యాక్స్‌లు అదనమని ట్రూజెట్ స్పష్టం చేసింది.

ఈ మేరకు ట్రూజెట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ ఆఫర్ సమయంలో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ మధ్య ప్రయాణించవచ్చునని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా ట్రూజెట్ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com