ట్రూజెట్ వారి రిపబ్లిక్ డే ఆఫర్
- January 24, 2021భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన ప్రయాణికులకు దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డోమేస్టిక్ ప్రయాణ టికెట్ను రూ. 926కే ఆఫర్ చేస్తోంది. ఈ టికెట్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభం అవగా.. జనవరి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ట్రూజెట్ సంస్థ తెలిపింది. అయితే, రూ. 926 రేట్కు ట్యాక్స్లు అదనమని ట్రూజెట్ స్పష్టం చేసింది.
ఈ మేరకు ట్రూజెట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ ఆఫర్ సమయంలో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ మధ్య ప్రయాణించవచ్చునని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా ట్రూజెట్ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు