భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 25, 2021న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ తగ్గాయి.. గత బులెటిన్లో దాదాపు 15 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదు కాగా.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన జాతా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 13,203 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 131 మంది కరోనాతో మృతిచెందగా... ఇదే సమయంలో 13,298 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,67,736కు చేరగా.. ఇప్పటి వరకు 1,03,30,084 కరోనాబారిన పడి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. మృతుల సంఖ్య 1,53,470కు పెరిగింది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,84,182 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం కరోనా బులెటిన్లో పేర్కొంది.. ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 16,15,504 మంది వ్యాక్సిన్ పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు ఆదివారం రోజు 5,70,246 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 19,23,37,117కు చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..