ఏ.పీ: సిఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం...

- January 25, 2021 , by Maagulf
ఏ.పీ: సిఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం...

అమరావతి: ఏ.పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో అత్యవసర సమావేశంను ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి, డీజీపీ, ఏజీ శ్రీరాంలు సమావేశం హాజరయ్యారు.  ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత లభించింది. ఎన్నికలు నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి, సెక్యూరిటీ పరమైన సమస్యలు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖా సెక్రటరీకి లేఖ రాసింది.  ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రబలగాలు కావాలని కోరింది.  ఒకవేళ కేంద్ర హోంశాఖ కనుక అంగీకరించి బలగాలను పంపితే ప్రభుత్వానికి కొంతమేర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com