ఏ.పీ: సిఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం...
- January 25, 2021అమరావతి: ఏ.పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో అత్యవసర సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి, డీజీపీ, ఏజీ శ్రీరాంలు సమావేశం హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత లభించింది. ఎన్నికలు నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి, సెక్యూరిటీ పరమైన సమస్యలు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటె, రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖా సెక్రటరీకి లేఖ రాసింది. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రబలగాలు కావాలని కోరింది. ఒకవేళ కేంద్ర హోంశాఖ కనుక అంగీకరించి బలగాలను పంపితే ప్రభుత్వానికి కొంతమేర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు