కోవిడ్ వ్యాక్సిన్లపై రూమర్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు
- January 25, 2021
న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా గత వారం రాసిన ఈ లేఖలో విపత్తు నిర్వాహణ చట్టం, భారత శిక్ష్మా స్మృతిలోని చట్టాలను ప్రస్తావిస్తూ.. వ్యాక్సిన్ల విషయంలో రుమార్లను వ్యాప్తి చేస్తున్న వారికి వర్తింప జేయాలని ఆదేశించారు. అదే సమయంలో వాస్తవాలేంటో తెలియజేయాలని కోరారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రుమార్లు చేస్తున్నారని, దీని వల్ల ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా జనవరి 16 నుండి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన సంగతి విదితమే. భారత్ బయోటెక్ నేతృత్వంలోని కొవాగ్జిన్, ఆస్ట్రాజెనికా-ఆక్స్ఫోర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ను తొలుత వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందిస్తున్నారు. కాగా, ఈ రెండు 110 శాతం సురక్షితమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిజిఐ) విజి సోమని తెలిపారు. కొవిషీల్డ్ 70.42 శాతం సురక్షితంగా కాగా, కొవాగ్జిన్ సురక్షితంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అన్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







