ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ పై నిబంధనలను సవరించిన యూఏఈ
- January 26, 2021యూఏఈ:వ్యాక్సిన్ ను పూర్తి స్థాయిలో తీసుకోని ఉద్యోగులకు సంబంధించి యూఏఈ మానవ వనరుల శాఖ కొత్త ఆదేశాలను జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే పూర్తి స్థాయి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. మొదటి డోసు తీసుకున్న ఉద్యోగులు కూడా విధిగా ప్రతి ఏడు రోజులకు ఒక సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే విధులు హజరు కావాలని ఆదేశించింది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకునే వరకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. మంత్రిత్వ శాఖల కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఆఫీసులలో విధులు నిర్వహించే కంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతి ఏడు రోజులకు ఓ సారి సొంత ఖర్చులతో పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే..రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రం పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే వైద్యపరంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులుగా నిర్ధారించిన వారికి పీసీఆర్ టెస్టులను ఆయా సంస్థలు భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు హజరవ్వాల్సిన కన్సల్టెంట్లు, నిపుణులు కూడా సమావేశాలకు మూడు రోజుల్లోపు పీసీఆర్ టెస్ట్ చేయించుకొవాలని మానవ వనరుల శాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు