పద్మ అవార్డులను ప్రకటించిన భారత ప్రభుత్వం...
- January 25, 2021న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 119 మంది పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్ పురస్కారలు ప్రకటించగా.. 10 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. 102 మంది పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది. నలుగురు తెలుగు వారికి పద్మశ్రీ పురస్కారాలు దక్కగా.. దివంగత గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. తమిళనాడు కోటాలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జపాన్ మాజీ ప్రధాని షింజూ అబేకు కూడా కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పద్మ అవార్డులు పొందిన వారి వివరాలు ఇవే..
పద్మవిభూషణ్ పురస్కారం..
1. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే
2. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
3. డాక్టర్ మోనప్ప హెగ్డే
4. నరీందర్ సింగ్ కపనీ
5. మౌలానా వాహుద్దీన్ ఖాన్
6. బి.బి. లాల్
7. సుదర్శణ్ సాహో
తెలుగు వారికి దక్కిన పద్మశ్రీ పురస్కారాలు..
1.అన్నవరపు రామస్వామి
2.ప్రకాశ రావు ఆశావాది
3.నిడుమోలు సుమతి
4.కనక రాజు
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..