న్యూ ఢిల్లీ:ఎర్రకోటపై రైతన్న జెండా!
- January 26, 2021న్యూ ఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల అనుమతితో ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టిన రైతులు కొందరు రూట్ మ్యాప్ మార్చేశారు. సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకుపోయారు. ఎర్రకోట ప్రాంగణానికి కూడా భారీ సంఖ్యలో చేరి ఆందోళన చేపట్టారు. ఎర్రకోట ముందు ఉన్న ఓ స్తంభంపై తమ జెండాలను ఎగురవేశారు. అనంతరం నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎర్రకోట పై తొలిసారి జాతీయ జెండా కాకుండా మరో జెండా ఎగరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా, వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు