ఢిల్లీలో మళ్ళీ ఉద్రిక్తతలు...
- January 29, 2021
ఢిల్లీ:ఢిల్లీలో జనవరి 26 వ తేదీన జరిగిన ఘటన తరువాత ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశరాజధాని ఢిల్లీ ప్రస్తుతం సైనిక పహారాలో ఉన్నది. ఒకవైపు ఘర్షణలకు కారణమైన వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక, ఢిల్లీ శివారు ప్రాంతమైన సింఘులో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైతులు సింఘు ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానికులు కొందరు రైతులు వేసుకున్న గుడారాలను పీకేశారు. గుడారాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో రైతులకు, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలను సముదాయించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ కుదరకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత టియర్ గ్యాస్ ను ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







