ఢిల్లీలో మళ్ళీ ఉద్రిక్తతలు...
- January 29, 2021
ఢిల్లీ:ఢిల్లీలో జనవరి 26 వ తేదీన జరిగిన ఘటన తరువాత ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశరాజధాని ఢిల్లీ ప్రస్తుతం సైనిక పహారాలో ఉన్నది. ఒకవైపు ఘర్షణలకు కారణమైన వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక, ఢిల్లీ శివారు ప్రాంతమైన సింఘులో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైతులు సింఘు ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానికులు కొందరు రైతులు వేసుకున్న గుడారాలను పీకేశారు. గుడారాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో రైతులకు, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలను సముదాయించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ కుదరకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత టియర్ గ్యాస్ ను ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







