ఢిల్లీలో మళ్ళీ ఉద్రిక్తతలు...

- January 29, 2021 , by Maagulf
ఢిల్లీలో మళ్ళీ ఉద్రిక్తతలు...

ఢిల్లీ:ఢిల్లీలో జనవరి 26 వ తేదీన జరిగిన ఘటన తరువాత ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశరాజధాని ఢిల్లీ ప్రస్తుతం సైనిక పహారాలో ఉన్నది. ఒకవైపు ఘర్షణలకు కారణమైన వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.  ఇక, ఢిల్లీ శివారు ప్రాంతమైన సింఘులో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  రైతులు సింఘు ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు.  స్థానికులు కొందరు రైతులు వేసుకున్న గుడారాలను పీకేశారు.  గుడారాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో రైతులకు, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలను సముదాయించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు.  కానీ కుదరకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.  ఆ తరువాత టియర్ గ్యాస్ ను ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com