ఢిల్లీలో మళ్ళీ ఉద్రిక్తతలు...
- January 29, 2021
ఢిల్లీ:ఢిల్లీలో జనవరి 26 వ తేదీన జరిగిన ఘటన తరువాత ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశరాజధాని ఢిల్లీ ప్రస్తుతం సైనిక పహారాలో ఉన్నది. ఒకవైపు ఘర్షణలకు కారణమైన వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక, ఢిల్లీ శివారు ప్రాంతమైన సింఘులో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైతులు సింఘు ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానికులు కొందరు రైతులు వేసుకున్న గుడారాలను పీకేశారు. గుడారాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో రైతులకు, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలను సముదాయించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ కుదరకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత టియర్ గ్యాస్ ను ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









