అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా
- January 29, 2021
యూఏఈ:వాహనదారులు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే 3,000 దిర్హాముల జరీమానా విధిస్తామని తాజాగా అబుదాబీ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. దారి ఇవ్వని వాహనాల్ని 30 రోజులపాటు జప్తు చేయడం కూడా జరుగుతుంది. సదరు వాహనదారుడికి ఆరు బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు. ప్రమాదాలు, ఇతర అత్యవసర విషయాల్లో సాయం కోసం ఎమర్జన్సీ వెహికిల్స్ నడిపేవారు, ట్రాఫిక్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ క్రమంలో సాయం పొందాల్సినవారికి సకాలంలో సాయం అందకుండా పోతోందని అధికారులు తెలిపారు. దీన్ని సామాజిక బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ ఎమర్జన్సీ వెహికిల్స్కి సహకరించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









