ఢిల్లీ ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద బాంబు పేలుడు

- January 29, 2021 , by Maagulf
ఢిల్లీ ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద బాంబు పేలుడు

ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఎవ్వరూ గాయలపాలవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయిల్ ఎంబసీ బయట పార్క్ చేైసి ఉన్న నాలుగైదు కార్ల అద్దాలు మాత్రం బాంబు పేలుడు ధాటికి డ్యామేజీ అయ్యాయని తెలిపారు.

బాంబు పేలుడు నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించారు. అబ్దుల్ కలామ్ రోడ్డుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానంగా ఉన్న వాటిని తనిఖీలు చేస్తున్నారు. అయితే, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ప్రధాని మోడీ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఇతర ప్రభుత్వ అధికారులు,నాయకులు హాజరైన విజయ్ చౌక్ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ పేలుడు సంభవించిడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com