ఢిల్లీ ఇజ్రాయల్ ఎంబసీ వద్ద బాంబు పేలుడు
- January 29, 2021
ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఎవ్వరూ గాయలపాలవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయిల్ ఎంబసీ బయట పార్క్ చేైసి ఉన్న నాలుగైదు కార్ల అద్దాలు మాత్రం బాంబు పేలుడు ధాటికి డ్యామేజీ అయ్యాయని తెలిపారు.
బాంబు పేలుడు నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించారు. అబ్దుల్ కలామ్ రోడ్డుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానంగా ఉన్న వాటిని తనిఖీలు చేస్తున్నారు. అయితే, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ప్రధాని మోడీ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఇతర ప్రభుత్వ అధికారులు,నాయకులు హాజరైన విజయ్ చౌక్ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ పేలుడు సంభవించిడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







