దుబాయ్: 11 నెలల తర్వాత తెరుచుకోనున్న చర్చి తలుపులు..ఫిబ్రవరి నుంచి ప్రార్ధనలు
- January 29, 2021
కోవిడ్ కారణంగా దుబాయ్ లో మూతపడిన చర్చి తలుపులు ఎట్టకేలకు 11 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి దుబాయ్ లోని క్యాథలిక్ చర్చిలో ప్రార్ధనలకు ఎమిరాతి పాలన యంత్రాంగం అనుమతించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి రోజు రెండు సార్లు పార్ధనలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.00 గంటలకు 30 నిమిషాల పాటు మాస్ ఉంటుందని సెయింట్ మేరీస్ క్యాథలిక్ చర్చి నిర్వాహకులు తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించారు. మిగతా సమయాల్లో చర్చిని మూసివేస్తారు. అయితే..భౌతిక దూరం నిబంధనను పాటించేందుకు వీలుగా చర్చి సామర్ధ్యంలో 30 శాతం అంటే 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ప్రార్ధనల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా చర్చి అధికారిక వెబ్ సైట్లో తమ వివరాలను నమోదు చేసుకొవాలి. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో అరగంట ముందే చర్చి ప్రాంగణానికి చేరుకోవాలి. ఫేస్ మాస్క్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రార్ధన సమయంలో నిర్దేశించిన ప్రదేశానికి మాత్రమే భక్తులు పరిమితం కావాలి, గేట్ నెంబర్ 2 నుంచి ప్రవేశించి..1,3 గేట్ల ద్వారా బయటికి వెళ్లాలి. 60 ఏళ్లకుపైబడిన వారు, 12 ఏళ్లలోపు ఉన్నవారు ప్రార్ధనలకు రావొద్దని కూడా చర్చి వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







