అమెరికాలో మహాత్మ గాంధీ విగ్రహం ధ్వంసం
- January 30, 2021
అమెరికా:జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి రోజున మహాత్ముడికి అమెరికాలో ఘోర అవమానం జరిగింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దావిస్ నగరంలోని సెంట్రల్ పార్కులో ఉన్న 6 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 294 కేజీల బరువు, ఆరు అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా బేస్ మెంట్ నుంచి తొలగించివేశారు. అయితే ఆ విగ్రహాన్ని అక్కడినుంచి తొలిగించి... దీన్ని మళ్ళీ బాగు చేస్తామని డేవిస్ సిటీ కౌన్సిలర్ ల్యుకాస్ ఫ్రెరిచ్ తెలిపారు. కాగా దీనిపై భారత అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అటు నాలుగేళ్ల కిందట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా పంపింది.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?







