అనుమతి లేని సోషల్‌ పోస్టింగ్స్‌పై కొరడా

- February 24, 2016 , by Maagulf
అనుమతి లేని సోషల్‌ పోస్టింగ్స్‌పై కొరడా


 ఇతరుల ఫొటోలను, వారి సమాచారాన్నీ అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినవారికి యూఏఈ ఐటీ చట్టం ప్రకారం ఇకపై ఆరు నెలల జైలు శిక్ష మరియు 500,000 దిర్హామ్‌ల జరీమానా తప్పదు. సోషల్‌ మీడియా వినియోగదారులు ఇప్పటిదాకా ఈ చట్టంపై అవగాహన కలిగిలేరని దుబాయ్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అలాగే పిల్లలు సోషల్‌ మీడియాలో ఏమేం చేస్తున్నారో తల్లిదండ్రులు వాచ్‌ చెయ్యాలనీ, లేదంటే పిల్లలు తేలిగ్గా అక్రమార్కుల వలలో పడతారని ఇంకో పోలీస్‌ అధికారి చెప్పారు. డెసిషన్‌ సపోర్ట్‌ సెంటర్‌, దుబాయ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్లా మాట్లాడుతూ సోషల్‌ మీడియా విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com