ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన రస్ అల్ ఖైమా
- January 31, 2021
రస్ అల్ ఖైమా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఉద్యోగులు ప్రతి ఏడు రోజులకు ఓ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలన్న యూఏఈ నిర్ణయాన్ని రస్ అల్ ఖైమా కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అజ్మన్, ఉమ్ అల్ ఖ్వైన్ గవర్నరేట్లో ఇప్పటికే ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ నిబంధనను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రస్ అల్ ఖైమా కూడా అదే బాటలో వెళ్తోంది. తమ పరిధిలోని ఉద్యోగులు ప్రతి వారం తమ సొంత ఖర్చులతో తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగటీవ్ రిపోర్ట్ తో ఆఫీసులకు రావాలని ఆదేశించింది. ఈ నిబంధన ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. అయితే..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక వైద్య పరమైన కారణాలతో వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హలుగా పేర్కొన్న వారికి పీసీఆర్ టెస్ట్ ఖర్చులను ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







