ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన రస్ అల్ ఖైమా

- January 31, 2021 , by Maagulf
ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన రస్ అల్ ఖైమా

రస్ అల్ ఖైమా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఉద్యోగులు ప్రతి ఏడు రోజులకు ఓ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలన్న యూఏఈ నిర్ణయాన్ని రస్ అల్ ఖైమా కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అజ్మన్, ఉమ్ అల్ ఖ్వైన్ గవర్నరేట్లో ఇప్పటికే ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ నిబంధనను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రస్ అల్ ఖైమా కూడా అదే బాటలో వెళ్తోంది. తమ పరిధిలోని ఉద్యోగులు ప్రతి వారం తమ సొంత ఖర్చులతో తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగటీవ్ రిపోర్ట్ తో ఆఫీసులకు రావాలని ఆదేశించింది. ఈ నిబంధన ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. అయితే..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక వైద్య పరమైన కారణాలతో వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హలుగా పేర్కొన్న వారికి పీసీఆర్ టెస్ట్ ఖర్చులను ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com