తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 31, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహ్మరి కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాగా, శుక్రవారం రాత్రి 8గంటల నుంచి శనివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,469కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది.
కాగా, శనివారం కరోనా రాకాసి బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 1,599కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 276 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,90,630కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,240 ఉండగా.. వీరిలో 828 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 1412 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇదిలావుంటే, నిన్న ఒక్కరోజే జీహెచ్ఎంసీలో కొత్తగా 28 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటివరకు తీసుకున్న కఠిన చర్యలతో కరోనా మహమ్మారిని నియంత్రించగలిగామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను తప్పసరిగా పాటించాలని కోరారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







