ఐపీఎల్–2021పై కీలక ప్రకటన
- January 31, 2021
ఐపీఎల్ 2021 నిర్వహాణపై బీసీసీఐ పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి.. టోర్నీ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ప్రధానంగా ఆలోచిపస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ 2020ని యుఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఇనాళ్ళు వచ్చే సీజన్ వేదికపై తర్జన బర్జన పడుతుంది. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ వివరణ ఇచ్చారు. ఐపీఎల్–2021 ప్రత్యామ్నాయ వేదికపై తాము ఏమాత్రం ఆలోచించడం తెలిపారు. భారత్లోనే టోర్ని నిర్వహించగలమని అత్మవిశ్యాసం వ్యక్తం చేశారు. ఆటగాళ్లందరికీ వ్యాక్సిన్ ఇప్పించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఐపీఎల్ ఎక్కడ జరపాలనే దానిపై బోర్డు సభ్యులు చర్చలు జరుపుతన్నట్లు వివరించారు.
ఐపీఎల్ 2021 సీజన్కు సన్నహాలు అప్పుడే మెుదలయ్యాయి. ఐపీఎల్ ప్లేయర్స్ వేలం ఫిబ్రవరి 18 న చెన్నై వేదికగా జరుగునుంది. ఈ విషయాన్ని ఐపిఎల్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. IPL 2021 సీజన్ మినీ వేలం కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు ఆటగాళ్ల రిటైన్/ రిలీజ్ ప్రక్రియను పూర్తి చేశాయ్.
ఈ ప్రక్రియలో 8 జట్లు 140 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంటే..57 మంది ప్లేయర్స్ ను రిలీజ్ చేశాయ్. అలాగే ఐపీఎల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లు ఫిబ్రవరి 2 లోగా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎక్కువ మంది ప్లేయర్స్ ను కలిగి ఉంది. ఇక తమ దగ్గర ఉన్న మొత్తంతో ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొనున్నాయ్ జట్లు. దీంతో స్టార్ ప్లేయర్స్ పై అన్ని ఫ్రాంచైజీల కన్ను పడింది. మార్చి 25 నుంచి ఐపీఎల్ ప్రారంభమయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేలంతో ఇండియాలో క్రికెట్ సన్నహాలు ఊపందుకొనున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020 ఎడిషన్ సెప్టెంబర్-నవంబర్లో యుఎఇలో జరిగిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనతో భారత్తో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
ఏయే జట్టు దగ్గర ఎంత డబ్బు ఉందో ఒకసారి లుక్కేద్దాం.
రాజస్థాన్ రాయల్స్ : 34.85 కోట్ల రూపాయలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ .35.70 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రూ. 22.90 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రూ .53.2 కోట్లు
ముంబై ఇండియన్స్: రూ. 15.35 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : రూ. 12.80 కోట్లు
కోల్కతా నైట్ రైడర్స్: రూ .10.85 కోట్లు
సన్రైజర్స్ హైదరాబాద్: రూ .10.75 కోట్లు
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







