కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హైదరాబాద్ కమీషనర్
- February 08, 2021
హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో విడత కొనసాగుతుంది. ఇందులో భాగంగా పాతబస్తీలోని పేట్లబర్జులో ఉన్న నగర పోలీసు శిక్షణా కేంద్రంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా టీకా సురక్షితమని సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఇటీవలే రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్తో పాటు పలువురు కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో రెండో దశ కరోనా టీకా పంపిణి ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యింది. ఇందులో ఫ్రంట్లైన్ వర్కర్లు అయిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు.కరోనా టీకా కోసం సుమారు 2 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









