వూహాన్లో కీలక ఆధారాలు లభ్యం:WHO
- February 08, 2021
వూహాన్:కరోనా వైరస్ చైనాలోని వూహాన్లో పుట్టిందని, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందని చాలా కాలం నుంచి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చైనాలో పర్యటించి ఆధారాలు సేకరించాలని ప్రపంచ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)పై ఒత్తిడి తీసుకురావడంతో గత రెండు వారాలకుపైగా WHO శాస్త్రవేత్తల బృందం చైనాలో పర్యటిస్తోంది. ఇక చైనాపై వస్తున్న ఆరోపణలను సైతం చైనా ఖండిస్తూ వస్తోంది. అయితే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల శాస్త్రవేత్తలు వూహాన్ ల్యాబ్లోనే కరోనా వైరస్ పుట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వూహాన్లో పర్యటిస్తున్న WHO నిపుణుల బృందం కరోనా మహమ్మారి పుట్టిక, వ్యాప్తికి సంబంధించి వివరాలు, ఆధారాల సేకరిస్తోంది.ఈ పర్యటనలో 14 మందితో కూడిన బృందం రెండు వారాలుగా క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తోంది.కాగా, కోవిడ్ వ్యాప్తిలో వూహాన్ సీపుడ్ మార్కెట్ పాత్రకు సంబంధించి ముఖ్య ఆధారాలు లభ్యమైనట్లు WHO బృందం సభ్యుడు పీటర్ డెస్జాక్ సోషల్ మీడియాల్లో ప్రకటించారు.ఫిబ్రవరి 10న పర్యటన ముగుస్తుందని, తాము తిరిగి వెళ్లేలోపు ఇందుకు సంబంధించిన ముఖ్యాంశాలు వెల్లడించే అవకాశం ఉందని న్యూయార్క్కు చెందిన శాస్త్రవేత్త వివరించారు.ఈ బృందం వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో కూడా సమావేశం అయింది. అలాగే మొదట్లో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో కరోనా పేషెంట్లకు వైద్యం అందించిన ఆస్పత్రులను సైతం పరిశీలించి అక్కడి వైద్యులతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







