బాలీవుడ్ నటుడు రాజీవ్ కపూర్ కన్నుమూత
- February 09, 2021
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత రాజ్కపూర్ తనయుడు, రిషీకపూర్ సోదరుడు రాజీవ్ కపూర్ గుండెపోటుతో మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. రాజీవ్ కపూర్ కన్నుమూసిన విషయాన్ని రిషీకపూర్ భార్య నీతూ కపూర్ 'ఇన్స్టాగ్రామ్' పోస్టులో ధ్రువీకరించారు. రిషీకపూర్ గత ఏడాదే క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు.


'ఏక్ జాన్ హై హమ్' (1983) చిత్రంతో నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజీవ్ కపూర్.. తన తండ్రి రాజ్కపూర్ చివరిసారిగా దర్శకత్వం వహించిన 'రామ్ తేరీ గంగా మైలి' చిత్రంలోనూ నటించారు. అనంతరం 'ఆస్మాన్', 'లవర్ బాయ్', 'జబర్దస్త్', 'హమ్ తో చలే పరదేశ్' వంటి చిత్రల్లోనూ నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. 1991లో రిషీకపూర్తో కలిసి 'హెన్నా' చిత్రాన్ని నిర్మించారు. రిషికపూర్, మాధురీ దీక్షిత్ నటించిన 'ప్రేమ్గ్రంథ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన 'ఆ అబ్ లౌట్ చలే' చిత్రాన్ని రాజీవ్ కపూర్ నిర్మించగా, రిషీ కపూర్ దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!









