నమీబియా పై భారత్ భారీ స్కోరు
- February 12, 2026
టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును సాధించింది.
భారత ఇన్నింగ్స్లో ఓపెనర్ ఇషాన్ కిషన్ (61) మెరుపు ఇన్నింగ్స్తో బలమైన పునాది వేశారు. అనంతరం మిడిలార్డర్లో హార్దిక్ పాండ్య (52) తనదైన శైలిలో విరుచుకుపడి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో భారత్ 200 పరుగుల మైలురాయిని సులువుగా అధిగమించింది.
మధ్యలో తిలక్ వర్మ (25), శివమ్ దూబే (23), సంజు శాంసన్ (22) కీలక పరుగులు జోడించినప్పటికీ, వారు తమ ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. మంచి ఆరంభం లభించినా, క్రీజులో సెట్ అయిన తర్వాత వికెట్లు పారేసుకోవడం భారత్కు కొంత మైనస్ అయింది.
ఒక దశలో భారత్ మరింత భారీ స్కోరు సాధించేలా కనిపించినా, చివరి ఓవర్లలో నమీబియా బౌలర్లు పుంజుకున్నారు. భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.
తాజా వార్తలు
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్







