దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- February 12, 2026
భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజిక్ రహదారి ముంబయిలో ప్రారంభమైంది. దేశ రహదారి రంగంలో ఇది ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది. ముంబయి నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ కోస్టల్ రోడ్లో నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు సుమారు 500 మీటర్ల మేర ఈ మ్యూజిక్ రోడ్డును ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేశారు.బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ రహదారి ప్రాజెక్ట్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలు కలిసి బుధవారం ప్రారంభించారు.
దీంతో మ్యూజిక్ రహదారి కలిగిన జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా, యూఏఈ దేశాల సరసన భారత్ చేరింది. రహదారిపై నుంచి వాహనాలు కదులుతున్నప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జయ హో’ పాట లోపలి ఉన్నవారికి వినిపిస్తుంది.రంబుల్ స్ట్రిప్లను ఉపయోగించి వేసిన ఈ రహదారిపై వాహనాలు గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు టైర్లు,
రోడ్డు ఉపరితలం మధ్య పరస్పర చర్యతో శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ వైబ్రేషన్స్ కారణంగా వెలువడే ధ్వని తరంగాలు ‘జయ హో’ పాట ట్యూన్ను తిరిగి వినిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్కు బీఎంసీ రూ.6.21 కోట్లు ఖర్చు చేసింది. నారీమన్ పాయింట్ వద్ద టన్నెల్ ఎగ్జిట్ తర్వాత ప్రియదర్శిని పార్క్, అమర్సన్స్ గార్డెన్ మధ్యలో ఈ మ్యూజిక్ రోడ్డును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్







