సౌదీ, ఖతార్ మధ్య ఫిబ్రవరి 14 నుంచి వాణిజ్యం తిరిగి ప్రారంభం
- February 13, 2021
రియాద్:దౌత్య సంబంధాల పునరుద్ధరణ తర్వాత గల్ఫ్ దేశాలతో ఖతార్ మైత్రి బంధం బలపడేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం వెలువడింది. ఫిబ్రవరి 14 నుంచి సౌదీతో వాణిజ్య సరుకుల రవాణా పున:ప్రారంభం కానుంది. అబు సమ్రా సరిహద్దు ద్వారా సరుకుల రవాణా జరగనున్నట్లు ఖతార్ కస్టమ్స్ జనరల్ అథారిటీ ప్రకటించింది. పోర్టుల ద్వారా సరుకు రవాణాకు గత నెలలోనే ద్వారాలు తెరిచిన ఇరు దేశాలు...దానికి కొనసాగింపుగానే అబు సమ్రా సరిహద్దు మీదుగా సరుకు రవాణాను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. సౌదీలోని సాల్వా పోర్టు, ఖతార్ లోని అబు సామ్రా పోర్టు ద్వారా సాధారణ వస్తు రవాణా కొనసాగుతుందని అయితే, కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలతో తాము సిద్ధంగా ఉన్నట్లు వివరించింది. తమ పరిధిలోని పోర్టుకు వచ్చే ట్రక్ డ్రైవర్లు అందరూ సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ గుర్తింపు పొందిన ల్యాబ్ ల నుంచి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. పోర్టుకు చేరుకునే సమయానికి మూడ్రోజుల్లోపు చేయించుకున్న టెస్టు రిపోర్టులనే పరిగణలోకి తీసుకుంటాని స్పష్టం చేసింది. నెగటీవ్ రిపోర్ట్ ఉన్నవారినే పోర్టుకు అనుమతిస్తామని, అదే సమయంలో అక్రమ రవాణా, ప్రమాదకర సరుకుల రవాణాను నియంత్రించేందుకు ట్రక్కులోని సరుకులను తనఖీలు చేపడతామని ఖతార్ తెలిపింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







