30 KDలకు పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్..ఇండియన్ ల్యాబ్ టెక్నిషియన్ అరెస్ట్
- February 13, 2021
కువైట్ సిటీ:గల్ఫ్ దేశాల్లో దాదాపు అన్ని వ్యవహారాలకు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అవుతోంది. ఇక విమాన ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఈ డిమాండ్ ను అసరాగా చేసుకొని అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు ఏకంగా పీసీఆర్ రిపోర్ట్ లను ఫోర్జరీ చేసి పట్టుబడ్డాడో ఇండియన్. కువైట్ లోని ఫర్వానియా గవర్నరేట్లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిందితుడు ల్యాబ్ టెక్నిషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నిందితుడు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను ఫోర్జరీ చేసి నెగటీవ్ రిపోర్ట్ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో ఫేక్ సర్టిఫికెట్ కు 30 దినార్లను అమ్ముకున్నాడని వివరించారు. ఇప్పటివరకు 60 సర్టిఫికెట్లను పలువురికి అమ్మినట్లు తమ విచారణలో వెల్లడైందని, ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశామన్నారు. అయితే..పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన వారు ఎవరు అనేది ఆరా తీస్తున్నామన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఇప్పటికే కొందరు దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించామని, ఇక కువైట్లో ఉన్నవారి కోసం ఆరా తీస్తున్నామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







