30 KDలకు పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్..ఇండియన్ ల్యాబ్ టెక్నిషియన్ అరెస్ట్
- February 13, 2021
కువైట్ సిటీ:గల్ఫ్ దేశాల్లో దాదాపు అన్ని వ్యవహారాలకు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అవుతోంది. ఇక విమాన ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఈ డిమాండ్ ను అసరాగా చేసుకొని అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు ఏకంగా పీసీఆర్ రిపోర్ట్ లను ఫోర్జరీ చేసి పట్టుబడ్డాడో ఇండియన్. కువైట్ లోని ఫర్వానియా గవర్నరేట్లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిందితుడు ల్యాబ్ టెక్నిషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నిందితుడు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను ఫోర్జరీ చేసి నెగటీవ్ రిపోర్ట్ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో ఫేక్ సర్టిఫికెట్ కు 30 దినార్లను అమ్ముకున్నాడని వివరించారు. ఇప్పటివరకు 60 సర్టిఫికెట్లను పలువురికి అమ్మినట్లు తమ విచారణలో వెల్లడైందని, ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశామన్నారు. అయితే..పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన వారు ఎవరు అనేది ఆరా తీస్తున్నామన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఇప్పటికే కొందరు దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించామని, ఇక కువైట్లో ఉన్నవారి కోసం ఆరా తీస్తున్నామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







