లైసెన్స్ లేని న్యూస్ అకౌంట్లపై ఫైన్..కువైట్ కోర్టు తీర్పు
- February 14, 2021
కువైట్ సిటీ:ఎలాంటి అనుమతులు లేకుండా, లైసెన్స్ తీసుకోకుండా సోషల్ మీడియాలో న్యూస్ అకౌంట్లను నిర్వహిస్తే జరిమానా ఎదుర్కొవాల్సిందేనని కువైట్ న్యాయ వ్యవస్థ హెచ్చరించింది.ట్విట్టర్ లో అతీజ్ అల్-మాసియన్ అనే పేరుతో న్యూస్ అకౌంట్ ను నిర్వహిస్తున్న వ్యక్తికి 5000 దినార్ల జరిమాన విధిస్తూ అప్పీల్ కోర్టు, క్రిమినల్ కోర్టు గతంలో తీర్పునిచ్చాయి. అయితే..ఈ తీర్పును నిందితుడు సవాల్ చేయటంతో కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్ట్ ఆఫ్ కాసేషన్...నిందితుడికి 5000 దినార్ల జరిమానా విధించటాన్ని సమర్ధించింది. జ్యూడిషియరీ రెగ్యూలేషన్స్ మేరకు లైసెన్స్ లేకుండా న్యూస్ అకౌంట్ల నిర్వహణ నేరమేనని స్పష్టం చేసింది.అయితే..సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఎమిరాతిలను అవమానించేలా, జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలు, పుకార్లను ప్రసారం చేశారనే ఆరోపణలను మాత్రం తోసిపుచ్చింది.ఈ ఆరోపణల్లో ప్రతివాదులు నిర్దోషులు అని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?







