లైసెన్స్ లేని న్యూస్ అకౌంట్లపై ఫైన్..కువైట్ కోర్టు తీర్పు
- February 14, 2021
కువైట్ సిటీ:ఎలాంటి అనుమతులు లేకుండా, లైసెన్స్ తీసుకోకుండా సోషల్ మీడియాలో న్యూస్ అకౌంట్లను నిర్వహిస్తే జరిమానా ఎదుర్కొవాల్సిందేనని కువైట్ న్యాయ వ్యవస్థ హెచ్చరించింది.ట్విట్టర్ లో అతీజ్ అల్-మాసియన్ అనే పేరుతో న్యూస్ అకౌంట్ ను నిర్వహిస్తున్న వ్యక్తికి 5000 దినార్ల జరిమాన విధిస్తూ అప్పీల్ కోర్టు, క్రిమినల్ కోర్టు గతంలో తీర్పునిచ్చాయి. అయితే..ఈ తీర్పును నిందితుడు సవాల్ చేయటంతో కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్ట్ ఆఫ్ కాసేషన్...నిందితుడికి 5000 దినార్ల జరిమానా విధించటాన్ని సమర్ధించింది. జ్యూడిషియరీ రెగ్యూలేషన్స్ మేరకు లైసెన్స్ లేకుండా న్యూస్ అకౌంట్ల నిర్వహణ నేరమేనని స్పష్టం చేసింది.అయితే..సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఎమిరాతిలను అవమానించేలా, జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలు, పుకార్లను ప్రసారం చేశారనే ఆరోపణలను మాత్రం తోసిపుచ్చింది.ఈ ఆరోపణల్లో ప్రతివాదులు నిర్దోషులు అని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







