ఒమన్ కు చేరిన 17,550 ఫైజర్ వ్యాక్సిన్
- February 14, 2021
మస్కట్:కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ బయోన్టెక్ సెకండ్ బ్యాచ్ శనివారం రాత్రికి సుల్తానేట్ కు చేరుకున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండో విడతలో భాగంగా మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 17,550 డోసుల వ్యాక్సిన్ వచ్చినట్లు స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే తొలి డోసు తీసుకున్న వారికి ఆదివారం నుంచి రెండో డోసును ఇవ్వనన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం సుల్తానేట్లోని గవర్నరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఫైజర్ టీకాల పంపిణిని నిన్న రాత్రి నుంచే ముమ్మరం చేసినట్ల ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇదిలాఉంటే..తొలిదశలో భాగంగా ఫైజర్ బయోన్టెక్ టీకాలను 24,773 మందికి ఇచ్చామన్నారు. అంటే లక్ష్యంగా ఎంచుకున్న వర్గంలో 98 శాతం మందికి వ్యాక్సిన్ అందిందని...ఇక అదే వ్యాక్సిన్ ను రెండో డోసుగా ఇప్పటివరకు 12,272 మంది తీసుకున్నారని వివరించారు. నిర్దేశిత లక్ష్యంలో ఇది 46 శాతమన్నారు. ప్రస్తుతం రెండో బ్యాచ్ వ్యాక్సిన్ కూడా ఒమన్ చేరుకోవటంతో రెండో డోసును ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







