19 ఏళ్ళ తర్వాత హీరోయిన్ షాలినీ రీఎంట్రీ
- February 14, 2021
చెన్నై:తమిళ స్టార్ హీరో అజిత్ సతిమణి షాలినీ వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బాలనటిగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న షాలినీ.. ఆ తర్వాత ‘సఖి’ సినిమాతో హీరోయిన్గా కూడా రాణించింది. టాప్ హీరోయిన్ రేసులో కొనసాగుతున్న సమయంలోనే షాలినీ.. హీరో అజిత్ను లవ్ మ్యారెజ్ చేసుకొని.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షాలినీ పూర్తిగా కుటుంబానికే అంకితమైపోయింది. 2001లో విడుదలైన ప్రియద వరం వెండూమ్ సినిమా తర్వాత షాలినీ ఏ చిత్రాల్లో నటించలేదు. ఇదిలా ఉండగా.. షాలినీ తిరిగి వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రిలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమాతో షాలినీ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 19 సంవత్సరాల తర్వాత షాలినీ మళ్లీ సినిమాల్లో నటించనుంది. ఇదిలా ఉండగా.. త్రిష, కార్తీ, ఐశ్వర్య రాయ్, విక్రమ్ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో షాలినీ ఓ కీలక పాత్రలో నటించనున్నారట. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే త్వరలో ఈ సినిమా చిత్రీకరణలో షాలినీ పాల్గోననున్నట్లుగా సమాచారం. దీనిపై ఇప్పటివరకు చిత్రయూనిట్ నుంచి గానీ.. షాలినీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష