కోవిడ్ 19: ఐసీయూ అడ్మిషన్ల పెరుగుదల

- February 16, 2021 , by Maagulf
కోవిడ్ 19: ఐసీయూ అడ్మిషన్ల పెరుగుదల

మస్కట్:ఒమన్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ అహ్మద్ అల్ సీది మాట్లాడుతూ, గడచిన రెండు వారాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరుతున్న కోవిడ్ 19 బాధితుల సంఖ్య 100 శాతం పెరిగినట్లు వెల్లడించారు.కరోనా వైరస్ వ్యాప్తి కొంత ప్రమాదకరంగా మారిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.20 మంది పేషెంట్లు ఐసీయూలో వుండేవారనీ, వారి సంఖ్య 41కి చేరిందని ఆయన తెలిపారు.100 శాతం కేసుల పెరుగుదల నేపథ్యంలో నార్త్ షర్కియా గవర్నరేట్ మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు.ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నవారు వెంటనే రెండో డోస్ తీసుకోవాల్సి వుంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆలస్యం కారణంగా ఒమన్‌లోనూ రెండో డోస్ విషయంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com