మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- September 22, 2025
మనామా: మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడిన వారికి ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన 38వే ల బ్రహెయిన్ దినార్లకు పైగా మసాజ్ పార్లర్ పేరుతో విదేశాలకు తరలించినట్లు జనరల్ మేనేజర్ ఆరోపణల ఎదుర్కొంటున్నాడు. అనేక మంది ఆసియా పెట్టుబడిదారులు ఉన్న ఈ హై-ప్రొఫైల్ మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 14న ఫైనల్ తీర్పును వెలువరించేందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు షెడ్యూల్ చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, మరణించిన సహచరుడితో పాటు నిందితులు 2019 - 2023 మధ్య బహ్రెయిన్లో మసాజ్ పార్లర్ల నెట్వర్క్ను నిర్వహించారు. వ్యభిచార కార్యకలాపాల నుండి వచ్చే నగదు, కార్డ్ చెల్లింపులను సేకరించడానికి ఈ సంస్థలను ఒక వేదికగా ఉపయోగించుకున్నారని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వచ్చిన మొత్తాన్ని బ్యాంకు బదిలీలు, కరెన్సీ ఎక్స్ఛేంజీల ద్వారా దేశం దాటించారు. ఆ కేసులో ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే, మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









