మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- September 22, 2025
మనామా: మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడిన వారికి ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన 38వే ల బ్రహెయిన్ దినార్లకు పైగా మసాజ్ పార్లర్ పేరుతో విదేశాలకు తరలించినట్లు జనరల్ మేనేజర్ ఆరోపణల ఎదుర్కొంటున్నాడు. అనేక మంది ఆసియా పెట్టుబడిదారులు ఉన్న ఈ హై-ప్రొఫైల్ మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 14న ఫైనల్ తీర్పును వెలువరించేందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు షెడ్యూల్ చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, మరణించిన సహచరుడితో పాటు నిందితులు 2019 - 2023 మధ్య బహ్రెయిన్లో మసాజ్ పార్లర్ల నెట్వర్క్ను నిర్వహించారు. వ్యభిచార కార్యకలాపాల నుండి వచ్చే నగదు, కార్డ్ చెల్లింపులను సేకరించడానికి ఈ సంస్థలను ఒక వేదికగా ఉపయోగించుకున్నారని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వచ్చిన మొత్తాన్ని బ్యాంకు బదిలీలు, కరెన్సీ ఎక్స్ఛేంజీల ద్వారా దేశం దాటించారు. ఆ కేసులో ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే, మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.
తాజా వార్తలు
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!







