మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- September 22, 2025
మనామా: మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడిన వారికి ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన 38వే ల బ్రహెయిన్ దినార్లకు పైగా మసాజ్ పార్లర్ పేరుతో విదేశాలకు తరలించినట్లు జనరల్ మేనేజర్ ఆరోపణల ఎదుర్కొంటున్నాడు. అనేక మంది ఆసియా పెట్టుబడిదారులు ఉన్న ఈ హై-ప్రొఫైల్ మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 14న ఫైనల్ తీర్పును వెలువరించేందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు షెడ్యూల్ చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, మరణించిన సహచరుడితో పాటు నిందితులు 2019 - 2023 మధ్య బహ్రెయిన్లో మసాజ్ పార్లర్ల నెట్వర్క్ను నిర్వహించారు. వ్యభిచార కార్యకలాపాల నుండి వచ్చే నగదు, కార్డ్ చెల్లింపులను సేకరించడానికి ఈ సంస్థలను ఒక వేదికగా ఉపయోగించుకున్నారని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వచ్చిన మొత్తాన్ని బ్యాంకు బదిలీలు, కరెన్సీ ఎక్స్ఛేంజీల ద్వారా దేశం దాటించారు. ఆ కేసులో ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే, మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.
తాజా వార్తలు
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!









