చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం
- February 16, 2021
చెన్నై:నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది.ఇంగ్లాండ్ పై 317 పరుగుల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది.టీమిండియా స్పిన్నర్ల ధాటికి విలవిలలాడిన ఇంగ్లండ్... రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది.ఇక రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్.ఏకంగా 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ను ఘోరంగా దెబ్బ తీశాడు అక్షర్ పటేల్. అటు అశ్విన్ రెండు ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. కాగా.. మొదటి ఇన్నింగ్స్లో టీం ఇండియా 329 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌట్ అయింది.ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో 164 పరుగులకే ఆలౌట్ అయి.. ఓటమి చవి చూసింది.4 టెస్టుల సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచిన భారత్, ఇంగ్లండ్.. 1-1తో సిరీస్ను సమం చేశాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







