ఘోర రోడ్డు ప్రమాదం-కాలువలోకి దూసుకువెళ్లిన బస్సు..

- February 16, 2021 , by Maagulf
ఘోర రోడ్డు ప్రమాదం-కాలువలోకి దూసుకువెళ్లిన బస్సు..

మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్లోని సిధి ప్రాంతంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. 57 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి కెనాల్ లోకి పడిపోయింది.ఈ బస్సు సిద్ధి నుండి సాత్నాకు వెళుతుండగా పట్నా వద్ద అదుపుతప్పి కాల్వలో పడింది.

కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు కొంత దూరం కొట్టుకుపోయింది. కాలువలోకి బస్సు పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే నీటిలోకి దూకి ప్రయాణీకుల్లో ఎడుగురిని కాపాడారు.ఈ ఘటనలో 32 మంది దుర్మరణం చెందారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటన పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, పోలీసులు,గత ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కెనాల్ నుండి బస్సును బయటకు తీశారు.కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని ఆపేసి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com