భారత్ లో పెరిగిన పెట్రోల్ ధర
- February 16, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల కారణంగా మంగళవారం దేశంలో మరోసారి పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 30 పైసలు పెరిగి రూ.89.29గా నమోదైంది. లీటర్ డీజిల్ 35 పైసలు పెరిగి రూ.79.70 వద్ద నిలిచింది.ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో లీటర్ రూ.95.75గా నమోదైంది. డీజిల్ దర రూ.86.35 ఉంది.హైదరాబాద్ విషయానికి వస్తే పెట్రోల్ ధర గరిష్ట స్థాయిలో నమోదైంది.లీటర్ పెట్రోల్ ధర రూ.92.84 ఉండగా, డీజిల్ ధర రూ.86.93 ఉంది. ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగడంతో అంతంత మాత్రంగా ఉన్న సామాన్యుడి ఆర్థిక పరిస్థితిపై అధిక ప్రభావాన్ని చూపుతుంది.ప్రతిపక్షాలు సైతం ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నాయి.కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







