కువైట్ హెల్త్ మినిస్టర్ తో ఇండియన్ అంబాసిడర్ భేటీ
- February 18, 2021
కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బాసిల్ అల్ సబాతో కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కువైట్లో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్ లో కరోనా తీవ్రత..కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వ్యాక్సిన్ ఉత్పత్తి తదితర అంశాలను కువైట్ ఆరోగ్య మంత్రికి సిబి జార్జ్ వివరించారు. భారత్ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకాను కువైట్ దిగుమి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 2 లక్షల డోసులను దిగుమతి చేసుకుంది కువైట్. అతి త్వరలోనే మరో బ్యాచ్ కూడా దిగుమతి కానుంది. వ్యాక్సిన్ సరఫారా వేగవంతంగా జరగేందుకు రాయబార కార్యాలయం చేస్తున్న కృషిని బాసిల్ అల్ సబా ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలాఉంటే..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రయాణ నిషేధం విధించటంపై కూడా సిబి జార్జ్ కువైట్ ఆరోగ్య మంత్రితో చర్చించారు. భారత్ నుంచి ప్రయాణికులను నేరుగా అనుమతించకపోవటం వల్ల చాలా మంది ఇండియాలోనే చిక్కుకుపోయారని సిబి జార్జ్ వివరించారు. అదే సమయంలో దుబాయ్ నుంచి కువైట్ చేరుకుంటున్న వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా వివరించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







