కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరిన సౌదీ
- February 18, 2021
సౌదీ: కోవిడ్ వ్యాక్సినేషన్ను సౌదీ అరేబియా మరింత ముమ్మరం చేసింది. కింగ్డమ్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న దేశ ప్రజలు అందరూ సెహత్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. తొలి దశ ముగియటంతో ప్రస్తుతం రెండో దశ వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నామని...ఇక నుంచి ఎవరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికే తొలి ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. అయితే..ముందస్తు షెడ్యూల్ ప్రకారం రెండో దశ వ్యాక్సినేషన్ నెల రోజుల ముందుగానే చేపట్టాల్సి ఉంది. కానీ, ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పత్తిలో కొరత నెలకొనటంతో సెకండ్ బ్యాచ్ అనుకున్న సమయానికి కింగ్డమ్ కు దిగుమతి కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. అంతేకాదు..డిసెంబర్ 17 నుంచి చేపట్టిన తొలి దశ వ్యాక్సినేషన్లో కింగ్డమ్ పరిధిలోని ఐదు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి ప్రాధాన్య వర్గాలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పుడు రెండో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేయటమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది తమంతట తాముగా వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ ఏడాది చివరి నాటికి 26 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది కింగ్డమ్ లక్ష్యమని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







