కువైట్ హెల్త్ మినిస్టర్ తో ఇండియన్ అంబాసిడర్ భేటీ
- February 18, 2021
కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బాసిల్ అల్ సబాతో కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కువైట్లో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్ లో కరోనా తీవ్రత..కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వ్యాక్సిన్ ఉత్పత్తి తదితర అంశాలను కువైట్ ఆరోగ్య మంత్రికి సిబి జార్జ్ వివరించారు. భారత్ ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకాను కువైట్ దిగుమి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 2 లక్షల డోసులను దిగుమతి చేసుకుంది కువైట్. అతి త్వరలోనే మరో బ్యాచ్ కూడా దిగుమతి కానుంది. వ్యాక్సిన్ సరఫారా వేగవంతంగా జరగేందుకు రాయబార కార్యాలయం చేస్తున్న కృషిని బాసిల్ అల్ సబా ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలాఉంటే..కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రయాణ నిషేధం విధించటంపై కూడా సిబి జార్జ్ కువైట్ ఆరోగ్య మంత్రితో చర్చించారు. భారత్ నుంచి ప్రయాణికులను నేరుగా అనుమతించకపోవటం వల్ల చాలా మంది ఇండియాలోనే చిక్కుకుపోయారని సిబి జార్జ్ వివరించారు. అదే సమయంలో దుబాయ్ నుంచి కువైట్ చేరుకుంటున్న వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా వివరించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







